రాంగోపాల్ వర్మ ట్వీట్లు, ఆయన మాటలు చూసి జనాలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయనకి ఆడవాళ్ల పిచ్చి అని ఒక ఇమేజ్ పడిపోయింది. కానీ ఇన్నేళ్ల కెరియర్లో ఏ హీరోయిన్ కూడా వర్మ గురించి చెడుగా మాట్లాడలేదు. ఆర్జీవీ అడ్డగోలుగా మాట్లాడినట్లు అనిపించినా..వ్యక్తిగా హి ఈజ్ జెంటిల్మెన్. ఆ విషయాన్ని హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా ధృవీకరించింది.
హాస్య నటుడు ఆలీ నిర్వహిస్తోన్న టీవీ షోలో కలర్స్ స్వాతి బోలేడన్నీ విషయాలు చెప్పుకొచ్చింది. అందులో వర్మ గురించి చేసిన కామెంట్ ఆసక్తికరం. ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంది ఆమె మాట.