నాగ చైతన్య, సమంత గత అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది తిరగ్గానే వారు తల్లితండ్రులయ్యారు. ఐతే వారు పేరెంట్స్ అయింది ఒక పప్పీకి. వారింట్లో ఈ పప్పికి రాచమర్యాదలు మొదలయ్యాయి. ఈ ఆనందాన్ని సమంత ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసుకొంది.
ఆ పప్పీ ఫోటోని, దాన్ని చాలా అభిమానంగా చూస్తున్న చైతన్య, సమంతల ఫోటోని ఆమె షేర్ చేసింది. చూస్తుంటే.. సమంత కూడా జంతు ప్రేమికురాలు అనిపిస్తోంది. సమంత అత్త అమల..దేశంలోనే పేరొందిన జంతు ప్రేమికురాలు, సంరక్షకురాలు. బ్లూక్రాస్ పేరుతో ఆమె ఒక సంస్థనే నడుపుతోంది.
నాగ చైతన్యతో పోటీ కాదు, నాగ చైతన్యతో కలిసి వస్తున్నా అని అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి చెపుతోంది సమంత. చైతన్య నటించిన "శైలజారెడ్డి అల్లుడు", సమంత తొలిసారిగా యాక్ట్ చేసిన థ్రిల్లర్ "యూటర్న్" ఒకే రోజు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 13న ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఒకరోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భార్యభర్తలిద్దరూ పోటీపడుతున్నారని అందరూ కామెంట్ చేస్తున్నారు. దాంతో చైతన్య వెర్సెస్ సమంత కాదు సమంత విత్ చైతన్య అని అనండి అని చెపుతోంది.
వినడానికి ఇది బాగానే ఉంది. మరి ఇద్దరూ తమ సినిమాలని కలిసి ప్రమోట్ చేస్తారా?
పెళ్లి అయి దాదాపు నెల రోజులవుతోంది. కొత్త జంట చైతన్య, సమంత ఇపుడు హనీమూన్ టూర్లో ఉన్నారు. స్కాట్లాండ్కి వెళ్లింది ఈ జంట. పెళ్లయిన నెలన్నర రోజుల తర్వాత వీరికి రిసెప్సన్ ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నాడు అక్కినేని నాగార్జున.