దర్శకరత్న దాసరి నారయణ రావు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవకి ఆయనకి ఈపాటికే దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు వచ్చి ఉండాల్సింది. ఇప్పటికైనా ఫాల్కే అవార్డును ప్రభుత్వం ప్రకటించాలని టాలీవుడ్ ప్రముఖులంతా డిమాండ్ చేశారు. దాసరి సంస్మరణ సభ ఈ రోజు ఫిల్మ్చాంబర్లో నిర్వహించింది తెలుగు సినిమా పరిశ్రమ. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు విచ్చేశారు.