తెలంగాణ ఎన్నికల్లో తెరాసకి అనుకూలంగా ఓటేయ్యాల్సిందిగా తన అభిమానులను, జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ కోరుతాడని రాజకీయ విశ్లేషకులు అంతా భావించారు. కానీ జనసేనాని మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగానూ చెప్పలేదు. ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని పంపాడు.
తక్కువ అవినీతి, పారదర్శకమైన పాలన అందించే వారిని ఎన్నుకోమని కోరాడు. దాన్ని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి.