శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. మొదటి కూతురు జాన్వీ ఇప్పటికే సక్సెస్ఫుల్ స్టార్గా మారింది. తొలి సినిమాతోనే స్టార్ అనిపించుకొంది. కరణ్ జోహర్ నిర్మించిన ‘ధడక్’ సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. కరణ్ బ్యానర్లోనే ఆమె మరో రెండు సినిమాలు ఒప్పుకొంది.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్గా స్థిరపడింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలకి ధడక్ కలిగించింది. అందచందాలతో మెప్పించింది. అభినయం పరంగా కూడా పాస్ మార్కులు తెచ్చుకొంది. ఐతే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ మాత్రం టోటల్గా గ్లామర్ గాల్గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లుంది. ఆమె తాజాగా చేస్తున్న అందాల షో చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే బాలీవుడ్లో మంచి హీరోయిన్గా స్థిరపడింది. ధడక్ ఆమె నటించిన తొలి చిత్రం. ఆమెని తెలుగులో కానీ, తమిళంలో కానీ నటింపచేయాలని పలువురు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఆమెని నటింపచేసేందుకు అంతా ఓకే అయిందని ఇటీవల కొన్ని వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి. వీటిపై జాన్వీ కపూర్ వివరణ ఇచ్చింది.