80, 90లలో ఖుష్బూ ఓ రేంజ్లో వెలిగింది. తమిళనాట ఐతే ఏకంగా ఆమెకి అప్పట్లో గుడికట్టారు. ఆమెకి అంతగా అభిమానులుండేవారు. టీనేజ్లోనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఐతే తన 40 ఏళ్ల కెరియర్లో ఎపుడూ వేధింపులు ఎదుర్కొలేదంటోంది. ఇపుడు ఇండియా అంతా మీటూ ఉద్యమం జరుగుతోంది.
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకి గురైన మహిళలు అంతా ఆ విషయాలను బయటపెడుతున్నారు. పలువురు దర్శకులు, నటులు, గాయకుల పరువు పోయింది.