"లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రాన్ని తిరుపతిలో గ్రాండ్గా అనౌన్స్ చేశాడు రాంగోపాల్ వర్మ. జనవరి 24న సినిమాని రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. అంటే కేవలం మూడు నెలల్లో సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ పాత్రని ఎవరు పోషిస్తారు, లక్ష్మీ పార్వతిగా ఎవరు నటిస్తారు అన్న విషయాన్ని బయటపెట్టలేదు.
రాంగోపాల్ వర్మని సినిమా సెలబ్రిటీలంతా అభిమానంగా రామూ అని పిలుస్తారు. జనాలకి ఆయన ఆర్జీవీ, సన్నిహితులకి రామూ. కానీ ఈ రాముడు దేవుడ్ని నమ్మడు. ఆయన పరమ నాస్తికుడు.
అలాంటి నాస్తికవాది ఈ రోజు అన్నమయ్యగా మారిపోయాడు. తిరుమల దేవుడ్ని పూజించాడు. పరమ భక్తుడిగా పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ప్రసాదాలు అందుకున్నాడు. శాలువా కూడా తీసుకున్నాడు. తన జీవితంలో మొదటిసారిగా గుడికి వెళ్లానని ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
మహా నటుడు ఎన్టీఆర్ జీవితం వెండి తెరపై ఆవిష్కృతం అవుతుందనగానే... తెలుగు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా, అభిమానంగా వేచిచూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే రాముడైనా... కృష్ణుడైనా... శివుడైనా... వేంకటేశ్వర స్వామి అయినా ఆ పాత్రకు ఎన్టీ రామారావు మాత్రమే జీవంపోయగలరు. ఆ దేవతామూర్తులు ఎన్టీఆర్ లాగే ఉంటారేమో అనిపిస్తుంది.