రాంగోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" గురించి తెలుగు దేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంగళవారం వివరించారు. వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడనీ, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలనీ వర్మతో ఈ సినిమా తీయిస్తున్నారని పార్టీ నేతలు ఆయనకి తెలిపారు. ఐతే ఈ సినిమా విషయంలో అతిగా ఆవేశపడొద్దని పార్టీ నేతలకి సూచించారు. వర్మ సినిమాకి పెద్ద ప్రజాదరణ ఉండదన్నారు సీఎం.
జనం పట్టించుకోని సినిమాల గురించి మీరు ఆవేశపడొద్దని బాబు వారికి తెలిపారు.