మహేష్బాబు నటిస్తున్న 25వ చిత్రం..మహర్షి. మహేష్బాబుకిది ప్రిస్టిజియేస్ మూవీ. 25వ సినిమాకి రిలీజ్ డేట్ని పక్కాగా ఫిక్స్ చేశాడు నిర్మాత దిల్రాజు. ఏప్రిల్ 25నే విడుదల అవుతుందని మరోసారి ప్రకటించాడు. ఇదే ఫైనల్ డేట్ అని చెప్పాడు.
మొదట మహర్షికి ఏప్రిల్ 5 అని డేట్ ఫిక్స్ చేశారు. ఐతే షూటింగ్లో జాప్యం జరిగింది. దాంతో తేదీ మారింది. మార్చి కల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం. అని దిల్ రాజు వివరించారు.
ఏంటి హెడ్లైన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏమి లేదండి. నమ్రత అలా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశారు. తన భర్త ఇంటికి వచ్చాడని...హి ఈజ్ బ్యాక్...హోమ్ అని ఆనందంగా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంట? వెల్... మహేష్బాబు పొల్లాచ్చి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారన్నమాట.
సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడు. భార్యాపిల్లలు, కొందరు స్నేహితులతో కలిసి కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటున్నాడు. మహేష్బాబు ఇటీవల తరుచుగా విదేశాలకి వెళ్లి సేద దీరుతున్నాడు. గతేడాది నాలుగు, అయిదు సార్లు ఫ్యామిలీతో ఫారిన్ హాలీడే ట్రిప్పులేశాడు. 2019 వేడుకలను దుబాయ్లో జరుపుకుంటున్నాడిపుడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే సుకుమార్ రెడీ చేస్తున్న ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ వింటాడట.