ఆదితి రావు రీసెంట్గా చేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఎన్నో ప్రశ్నలకి డిస్కషన్ పాయింట్ అయింది ఆమె ట్వీట్. ఒక బాలీవుడ్ బడా హీరోని ఉద్దేశించే ఆమె ఈ ట్వీట్ చేసిందని అర్థమవుతోంది. మీటూ వివాదంలో ఆదితి రావు బాధిత మహిళలకి ట్విట్టర్ ద్వారా మద్దతు తెలుపుతూ వస్తోంది. ఐతే బాలీవుడ్లో ఇపుడు దొంగే పోలీసుని దొంగ అన్న వైనం సాగుతోందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.
ఎవరైతే హీరోయిన్లని లైంగికంగా వేధిస్తారో..వారే ఇపుడు ముందుకొచ్చిన నీతిసూత్రాలు చెపుతున్నారని ఆమె ఇన్డైరక్ట్గా చెప్పింది.
80, 90లలో ఖుష్బూ ఓ రేంజ్లో వెలిగింది. తమిళనాట ఐతే ఏకంగా ఆమెకి అప్పట్లో గుడికట్టారు. ఆమెకి అంతగా అభిమానులుండేవారు. టీనేజ్లోనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఐతే తన 40 ఏళ్ల కెరియర్లో ఎపుడూ వేధింపులు ఎదుర్కొలేదంటోంది. ఇపుడు ఇండియా అంతా మీటూ ఉద్యమం జరుగుతోంది.
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకి గురైన మహిళలు అంతా ఆ విషయాలను బయటపెడుతున్నారు. పలువురు దర్శకులు, నటులు, గాయకుల పరువు పోయింది.
మీటూ వివాదం దేశమంతా మార్మోగుతుండడంతో ప్రతి సెలబ్రిటీ స్పందించక తప్పని పరిస్థితి వచ్చింది. అందాల అనసూయ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. "పని చేసే చోట మహిళలకి వేధింపులు ఉండడం అనేది చాలా కాలంగా చూస్తున్నాం. ఈ ధోరణి మారాలి. తెలుగు చిత్రసీమలో వేధింపులు లేవని చెప్పను కానీ చాలా తక్కువ," అని తన ఒపినియన్ని వెల్లడించింది.