అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతోన్న "మిస్టర్ మజ్ను" సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. సినిమాలో ఒక్క సీన్కి, ఒక షాట్కి కట్ చెప్పలేదట.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని డైరక్ట్ చేశాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత.
మొదటి సినిమా డిజాస్టర్. రెండో సినిమా ఫ్లాప్. ఆటోమేటిగ్గా మూడో సినిమాకు మార్కెట్ పడిపోతుంది. ఆ విషయం మొట్టమొదట శాటిలైట్ రైట్స్ విషయంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం థియేట్రికల్ రైట్స్ కంటే ముందు శాటిలైట్ డీల్ పూర్తి చేస్తున్నారు. సరిగ్గా అఖిల్ మార్కెట్ ఇక్కడే బయటపడింది.
వరుస ఫ్లాపులో సతమతమవుతున్న ఈ హీరో తన మూడో ప్రయత్నంగా మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొనేందుకు ఏ టీవీ ఛానెల్ ముందుకురావడం లేదు. దీంతో శాటిలైట్ డీల్ తో బోణీకొడదామనుకున్న యూనిట్ కు చుక్కెదురైంది.
అఖిల్ నటించిన మూడో సినిమాకి కూడా వాయిదాల పర్వం తప్పడం లేదు. అఖిల్ నటించిన మొదటి రెండు సినిమాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాయి. ఆ రెండూ (అఖిల్, హలో) ఫ్లాప్ అయ్యాయి. ఈ సారి ఇతర పెద్ద సినిమాల కారణంగా రెండు నెలల పాటు వాయిదా వేయక తప్పడంలేదట.
అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం.."మిస్టర్ మజ్ను". ఈ ఏడాది వరుణ్ తేజ హీరోగా "తొలిప్రేమ" అనే సినిమాని తీసి మంచి పేరు సంపాదించుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి తీస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే "మిస్టర్ మజ్ను" టీజర్ వచ్చింది. డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు.