అఖిల్ నటిస్తున్న మిస్టర్ మజ్నుకి సంబంధించిన గ్లిప్మ్స్ (టీజర్లాంటిదే) వీడియో గతేడాది నవంబర్లో విడుదలైంది. తాజాగా టీజర్ వచ్చింది. రెండింటిలో మేటర్ సేమ్..హీరో కాసనోవా పాత్రలాంటిది అన్నది ఎస్టాబ్లిస్ చేయడమే. ఈ కొత్త టీజర్ ఇంతకుముందు వచ్చిన దానికి మించి ఏమీ చెప్పలేదు, చూపలేదు.
మొదటి సినిమా డిజాస్టర్. రెండో సినిమా ఫ్లాప్. ఆటోమేటిగ్గా మూడో సినిమాకు మార్కెట్ పడిపోతుంది. ఆ విషయం మొట్టమొదట శాటిలైట్ రైట్స్ విషయంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం థియేట్రికల్ రైట్స్ కంటే ముందు శాటిలైట్ డీల్ పూర్తి చేస్తున్నారు. సరిగ్గా అఖిల్ మార్కెట్ ఇక్కడే బయటపడింది.
వరుస ఫ్లాపులో సతమతమవుతున్న ఈ హీరో తన మూడో ప్రయత్నంగా మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొనేందుకు ఏ టీవీ ఛానెల్ ముందుకురావడం లేదు. దీంతో శాటిలైట్ డీల్ తో బోణీకొడదామనుకున్న యూనిట్ కు చుక్కెదురైంది.
'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటించి సినిమారంగంలోకి అడుగుపెట్టింది మోడల్ నిధి అగర్వాల్. . నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి సినిమా ఆమెకి కలిసిరాలేదు. హిట్, ఫ్లాప్ల విషయాన్ని పక్కన పెడితే ఆమెకి ఈ సినిమాలో దక్కిన పాత్ర "చిత్ర"విచిత్రమైనది. ఏ మాత్రం గుర్తింపు వచ్చేది కాదు.
మొదటి సినిమా విడుదల కాకముందే ఆమె చైతన్య తమ్ముడు అఖిల్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
అఖిల్ నటించిన మూడో సినిమాకి కూడా వాయిదాల పర్వం తప్పడం లేదు. అఖిల్ నటించిన మొదటి రెండు సినిమాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాయి. ఆ రెండూ (అఖిల్, హలో) ఫ్లాప్ అయ్యాయి. ఈ సారి ఇతర పెద్ద సినిమాల కారణంగా రెండు నెలల పాటు వాయిదా వేయక తప్పడంలేదట.
అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం.."మిస్టర్ మజ్ను". ఈ ఏడాది వరుణ్ తేజ హీరోగా "తొలిప్రేమ" అనే సినిమాని తీసి మంచి పేరు సంపాదించుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి తీస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే "మిస్టర్ మజ్ను" టీజర్ వచ్చింది. డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు.