జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్రామ్ తమ తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. కల్యాణ్రామ్ కూడా తన తండ్రి మరణాన్ని తలుచుకొని స్టేజ్పైనే ఏడ్చేశాడు. నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన నెల రోజుల తర్వాతే ఈ ఈవెంట్ జరిగింది.