డైరెక్టర్ మారుతి తీసిన 'ప్రతి రోజు పండగే' పెద్ద హిట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సర్ ప్రైజ్ హిట్. అంతకుముందు సరైన హిట్స్ లేక బాధ పడుతోన్న సాయి ధరమ్ తేజ్ మూవీ 30 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంటుంది అని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమాకి ముందు మారుతీ పరిస్థితి కూడా బాలేదు. పెద్ద హిట్ వచ్చి చాలాకాలం అయింది. అందుకే... ఆ మూవీ రిలీజ్ కి ముందే నిర్మాత దానయ్య కొడుకుని హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు, దానికి గాను 6 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ఒక వెబ్సైటు లో న్యూస్ ప్లాంట్ చేయించుకున్నాడు.