రామ్చరణ్ కూడా పొలిటికల్ కామెంట్స్ చేయడం మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు. గురువారం హైదరాబాద్లో జరిగిన "వినయ విధేయ రామ" ప్రీరిలీజ్ ఈవెంట్లో రామ్చరణ్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం అభిమానులకి హుషారునిచ్చింది. ఇటీవల జనసేన పార్టీకి చాయ్ తాగే గ్లాస్ని పార్టీ గుర్తుగా ప్రకటించింది ఎన్నికల సంఘం. దాంతో టీగ్లాస్ని పాపులర్ చేయాల్సిన అవసరం ఉంది జనసేనకి. మరి అభిమానులంతా వచ్చినపుడు ఆ వేదికని ఉపయోగించుకోకపోతే ఎలా. ఆ బాధ్యతని చరణ్ తీసుకున్నాడు.