కంగన రనౌత్ కొన్నాళ్లూగా ఆలియా భట్ ని టార్గెట్ చేస్తోంది. ఆలియా భట్ చెంచాగిరీ చేసి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతోందని ఘాటుగా విమర్శిస్తోంది. ఐతే ఆలియా మాత్రం కంగనకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.
కంగనని గట్టిగా తిడితే ఏ ప్రమాదం ముంచుకొస్తోందో అని ఆమె భయపడుతోంది. ఎందుకంటే హృతిక్ రోషన్ వంటి బడా హీరోనే కంగనాతో పెట్టుకొని దెబ్బతిన్నాడు.
తాజాగా కంగన సోదరి రంగోళి..సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్య చేసింది. ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ గురించి ఆమె కామెంట్ చేసింది. కంగనని బాలీవుడ్ కి పరిచయం చేసిన నిర్మాత మహేష్ భట్. ఐతే ఆయన ఒకపుడు కంగనపైకి చెప్పు విసిరాడని బయటపెట్టింది రంగోళి.
నేను బంగారంలాంటి సినిమాని తీసి ఇస్తే ...దాన్ని కంగన వెండిగా మార్చిందని క్రిష్ వాపోతున్నారు. "మణికర్ణిక" విడుదల తర్వాత క్రిష్..ముంబై మీడియాకి అదే పనిగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. విడుదలైన సినిమాలో ఇప్పటికి 70 శాతం తనదే అని అంటున్న క్రిష్కి కంగన సిస్టర్ రంగోలి ఘాటుగా సమాధానం ఇచ్చింది.
బాబూ సరే ...సినిమా అంతా మీరే తీశారని ఒప్పుకుంటున్నాం. ఇక శాంతించు. కంగన ఫేస్ వల్లే సినిమా ఆడుతుందనేది వాస్తవం కదా. ఆమెని అలా వదిలెయ్యి. ఆమె సక్సెస్ని ఎంజాయ్ చేయనివ్వు. ఇక మీ పని మీరు చూసుకొండి, అంటూ ట్వీట్ చేసింది రంగోలి. ఇన్డైరక్ట్గా భారీ సెటైర్ వేసింది.