ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. హీరోయిన్లు కూడా సెట్ అయిపోయారు. ఇంకేముందని అంతా అనుకున్నారు. కానీ చాలామంది విలన్ విషయాన్ని మరిచిపోయారు. అవును.. 'జైలవకుశ' సినిమాకు మొన్నటివరకు విలన్ దొరకలేదు. ఎట్టకేలకు ఆ స్థానం భర్తీ అయింది బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ను జై లవకుశ సినిమాలో విలన్ గా తీసుకున్నారు.
మొదట ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ ను విలన్ గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు దునియా విలన్. అప్పట్నుంచి ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని రోనిత్ రాయ్ భర్తీ చేశాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు.