కబడ్డీ ఆటకి మళ్లీ క్రేజ్ పెరగుతోంది. ఈ ఆటకి కూడా ప్రీమియర్ లీగ్లు స్టార్ట్ అయ్యాయి తెలుగునాట. తెలంగాణ కబడ్డి ప్రీమియర్ లీగ్లో నల్గొండ జట్టుని కొన్నాడు రాజమౌళి కొడుకు కార్తీకేయ. ఈ జట్టులో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా భాగస్వామి. ఇక ఈ జట్టుకి మెంటార్గా ఉండేందుకు రాజమౌళి అంగీకరించడం విశేషం.
ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ తీయనున్న బయోపిక్కి టైటిల్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ అనే పేరునే టైటిల్గా రిజిష్టర్ చేయించారు. ఒకే ఒక్కడు, భారతరత్న, తిరుగులేని మనిషి వంటి పేర్లను పరిశీలించారు కానీ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల్లోనే అసలు పవర్ ఉందని అదే టైటిల్ని రిజిష్టర్ చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడు.
తేజ దర్శకత్వంలో రూపొందే ఈ బయోపిక్ని నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రెపాటి సంయుక్తంగా నిర్మిస్తారు. వారి మూడు బ్యానర్స్ పాలుపంచుకొంటాయి నిర్మాణంలో.