వరుసగా ఆరు ఫ్లాప్లు రావడంతో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజకి తెలిసొచ్చింది తాను సినిమాల సెలక్షన్ల విషయంలో తప్పు చేస్తున్నానని. తేజ్ ఐలవ్యూ అట్టర్ఫ్లాప్ కాగానే అమెరికా వెళ్లిపోయాడు. మేకోవర్ చేయించుకొని తిరిగి ఇండియాకి వచ్చాడు. నాలుగు నెలల గ్యాప్ తీసుకొని ఇపుడు కొత్తగా సినిమాలు ఒప్పుకునేందుకు రెడీ అవుతున్నాడు. తాను చేసిన తప్పులు ఏంటి, ఇకపై ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని తన అభిమానుల సలహాలు కూడా తీసుకుంటున్నాడు.
తాజాగా అభిమానులకి రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అక్టోబర్ 15న సాయి ధరమ్ పుట్టిన రోజు.