ఎట్టకేలకి విజయశాంతి పేరు మీడియాలో మార్మోగనుంది. ఆమె ఫేస్ కనిపించనుంది. కాంగ్రెస్ పార్టీ ఆమెని స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ కమిటీలను ప్రకటించింది. విజయశాంతికి కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాన ప్రచారకర్త హోదాతో పాటు ఎన్నికల ప్రచార కమిటీకి సలహాదారుగా బాధ్యత అప్పగించింది.