ఈ శుక్రవారం రిలీజైన "బ్రాండ్బాబు"పై కేసు నమోదైంది. ఒక మహిళా జర్నలిస్ట్ సినిమాపై కేసు వేసింది. తన అనుమతి లేకుండా తన ఫోటోని సినిమాలో ఉపయోగించారని ఓ మహిళా జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో చావుకి సంబంధించిన సన్నివేశంలో తన ఫోటోని చూపించారని, దీనికి తన పర్మిషన్ తీసుకోలేదని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇది తనకి, తన కుటుంబ సభ్యులకి తీవ్ర మనస్థాపం కలిగించిందని ఆమె చెప్పడంతోమూవీ మేకర్స్పై ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.