Telugu TV Serials

న‌టి మ‌ల్లిక క‌న్నుమూత‌

ప్ర‌ముఖ టీవీ న‌టి, యాంక‌ర్ మ‌ల్లిక (39) కన్ను మూసింది. కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. గ‌త ప‌క్షం రోజులుగా ఆమె కోమాలోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు (అక్టోబ‌ర్ 9)న బెంగుళూరులోని ఆసుప‌త్రిలోనే తుదిశ్వాస విడిచింద‌ట‌.

ఆమె అసలు పేరు అభినయ‌. యాంక‌ర్‌గా బాగా పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత న‌టిగా స్థిర‌ప‌డింది. అనేక టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించింది. కొన్ని సినిమాల్లోనూ క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది.  మ‌హేష్‌బాబు హీరోగా రూపొందిన తొలి చిత్రం రాజకుమారుడు చిత్రంలో హీరో కృష్ణ భార్యగా నటించింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన మ‌ల్లిక పెళ్లి త‌ర్వాత ఆమె బెంగుళూరులో స్థిర‌ప‌డింది.

Subscribe to RSS - Telugu TV Serials
|

Error

The website encountered an unexpected error. Please try again later.