టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో నోటీసులు ఎవరెవరికి వెళ్లాయనే విషయంపై ఇప్పుడు పెద్దగా చర్చ అవసరం లేదు. ఎవరెవరు ఇందులో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ పర్వం త్వరలోనే మొదలుకాబోతోంది. నోటీసులు అందుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా బయటకు రాబోతున్నారు. మూడు దశల్లో ప్రముఖుల్ని విచారించాలని నిర్ణయించింది ఎక్సైజ్ సిట్. మొదట వ్యక్తిగత వివరాల గురించి ప్రశ్నిస్తారట. రెండో దశలో వ్యక్తిగత అలవాట్లు (ధూమపానం, మద్యపానం) గురించి అడుగుతారట. ఇక కీలకమైన మూడో రౌండ్ లో అసలైన ప్రశ్నలు బయటకొస్తాయని తెలుస్తోంది.