ఉదయాన్నే లేచిన వెంటనే తెలుగు ప్రేక్షకులకు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు మంచు మనోజ్. సినిమాల్లో ఇక నటించను అని మంచు మనోజ్ ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న 'ఒక్కడు మిగిలాడు' ప్రాజెక్టుతో పాటు సెట్స్ పై ఉన్న మరో ప్రాజెక్టు మాత్రమే తన ఆఖరి సినిమాలని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇంత సడెన్ గా మంచు మనోజ్ ఎందుకింత నిర్ణయం తీసుకున్నాడు అని జనం అంతా గింజుకుంటున్న కొద్దిసేపటికే తన ట్వీట్ని డిలీట్ చేశాడు.