నితిన్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. ఇప్పటికే సితార ఎంటర్ టెన్న్మెంట్స్ బ్యానర్ పై 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ జోరుగా సాగుతోంది. దానికితోడు, చంద్రశేఖర్ యేలేటి కూడా ఒక మూవీ షూటింగ్ మొదలుపెట్టాడు. ఆ సినిమాలో కూడా హీరో నితిన్. ఇలా రెండు సినిమాలు సెట్ పై ఉండగానే, ఇంకో సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ చేసింది. ఏమిటి ఈ స్పీడు!!
అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతోన్న "మిస్టర్ మజ్ను" సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. సినిమాలో ఒక్క సీన్కి, ఒక షాట్కి కట్ చెప్పలేదట.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని డైరక్ట్ చేశాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత.