కమెడియన్ వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఐతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేట్గా నిర్ణయం తీసుకున్నాడో లేదో పార్టీ అతనికి టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ ఇపుడు బరిలో నిలిచాడు. సొంత ఊరు అయిన కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు వేణుమాధవ్.