తండ్రి పాత్రలకి పేరొందిన ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆదివారం (అక్టోబర్ 21) తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారు అమెరికాలో ఉంటున్నారు. తేజ తీసిన నువ్వు నేను సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత అలాంటి అనేక పాత్రలకి కేరాఫ్గా నిలిచారు చాలాకాలం.