వాణీ విశ్వనాథ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనేది పాత న్యూసే. మలబార్ తీరాన పుట్టిన ఈ కేరళ కుట్టి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హల్చల్ చేయనుంది. త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేరకముందే...ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వర్మపై విమర్శలు గుప్పించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చరిత్రని తీస్తున్నా అని వర్మ ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు తెగ వర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వనాథ్ స్పందించింది.