రామూ రాముడిగా మారిపోయాడు (రాంగోపాల్ వర్మని బాలీవుడు రామూ అని పిలుస్తుంటుంది లెండి). ఆ రామూ అలియాస్ ఆర్జీవీ ఇపుడు వోడ్కా పుచ్చుకోవడం లేదట. వోడ్కా తాగడం మానేసి, ఇపుడు పాలు తాగుతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే బయటపెట్టాడు.
ఇంతకీ ఏ పాలు తీసుకుంటున్నాడు ? ఆ డౌట్ కూడా తీర్చేశాడు. కొబ్బరి పాలు తీసుకుంటున్నా అని ఆయనే ట్వీటాడు. ఏడు నెలల తర్వాత ఆయన మళ్లీ ట్విట్టర్లోకి వచ్చాడు. ఇన్నాళ్ల అజ్ఞాతవాసం తీరిందట. ఇపుడు మళ్లీ ట్వీట్లతో రెచ్చిపోనున్నాడు.