మహాకవి డాక్టర్ సినారెకి తెలుగు చిత్రసీమ ఘన నివాళులు అర్పించింది. ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
చిరంజీవి
సినారె భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. జీవిత కాలమంతా సినారె దర్పంగానే ఉంటూ.. మంచి జీవితాన్ని గడిపారన్నారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందారనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.