కొంతకాలంగా దర్శకుడు వైవిఎస్ చౌదరి సినిమాలకి దూరంగా ఉంటున్నారు. రేయ్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన మరో మూవీ చేయలేదు. రీసెంట్గా వైవిఎస్ మరో లవ్స్టోరీ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు ఆయన వార్తల్లో నిలిచాడు ఒక లేఖ రూపంలో. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సినిమావాళ్ల జీవితాలను అద్దాల మేడ జీవితాలతో పోల్చాడు. ఆయన రాసిన లేఖని చూడండి..
మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే,
మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే,