దర్శకుడు సుకుమార్ నిర్మాత అవతారం ఎత్తి "కుమారి 21 ఎఫ్" అనే చిన్న చిత్రాన్ని నిర్మించాడు. అది సూపర్హిట్ అయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై దర్శకుడు అనే మరో మూవీ కూడా తీశాడు కానీ అది పరాజయం పాలు అయింది. దాంతో ఇక నిర్మాతగా సినిమాలకి ఫుల్స్టాప్ పెడుతారనుకున్నారంతా. ఐతే "రంగస్థలం" సినిమాతో దర్శకుడిగా సుకుమార్ రేంజ్ మారిపోయింది. సుకుమార్ బ్రాండ్ నేమ్ కూడా మరింతగా పెరిగింది. దాంతో ఇపుడు ఆయన ప్రొడక్షన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు, నాలుగు సినిమాలను తన బ్యానర్పై నిర్మించనున్నాడు.
పవన్ కల్యాణ్ యూరోప్ నుంచి వచ్చి రాగానే తన జనసేన పార్టీ నేతలతో కలిసి ముచ్చటించారు. లండన్లో గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం, అక్కడ ప్రముఖులు తన ఆలోచనలను, సైద్దాంతికతకి మద్దతు తెలపడం గురించి జనసేనాని వారికి వివరించారు. ప్రస్తుతం జనసేన పార్టీపై పూర్తిగా ఫోకస్ నిలిపారు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాగానే పవన్ జనసేనకి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెడుతారు.