పవర్స్టార్ పవన్ కల్యాణ్ని టార్గెట్ చేసి వార్తల్లో నిలిచిన క్రిటిక్ కత్తి మహేష్ ఇపుడు తన విమర్శల కత్తిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు తిప్పారు. జైల్లో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగని దళిత యువ సంచలనం, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో కలిసారు. మందకృష్ణకి జిగ్నేష్ తన మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడిన కత్తి మహేష్..కేసీఆర్ మీద విమర్శలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.