శివాజీరాజా, నరేష్ ల మధ్య మొదలైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మొత్తానికి ముగిశాయి. అంటే ఏదో ఆ సవాళ్ళకి సమాధానాలు దొరకడం వల్ల సామరస్యంగా ముగిసింది అనుకొంటే భ్రమే. సినీ పెద్దలు రంగ ప్రవేశం చేసి ఇంతకంటే పరువుపోగొట్టుకోలేం అని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ షాపోడు, ఈ షాపోడు గొడవపడితే ఉప్పు రేటు బయటపడింది అన్నట్లు – అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల మధ్య గొడవ మూలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డొల్లతనం బయటపడింది.
మొన్నటి వరకు తిట్టుకున్న నరేష్, శివాజీరాజీ ఇపుడు రాజీపడ్డారు. రాజీపడ్డారు అనడం కన్నా రాజీ పడేలా చేశారు అనడం కరెక్ట్. మా అసోషియేషన్ 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా నిర్మాతలు కలగచేసుకొని సమస్యని సాల్వ్ చేశారు. కలెక్టివ్ కమిటీ అనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో పేరొందిన నిర్మాతలు మా సమస్యని పరిష్కరించారు. మా నిధులన్నీ గోల్మాల్ చేశాడని శివాజీరాజీపై ఆరోపణలు వచ్చాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్.. ఇద్దరూ మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఆరోపణలు చేసుకున్నారు. శివాజీరాజాది గోల్మాల్ వ్యవహారమే అంటున్నాడు నరేష్.
నిజంగా శివాజీరాజా ఎలాంటి అక్రమాలకి పాల్పడకపోతే విచారణకి ఎందుకు అంగీకరించడం లేదని అడుగుతున్నాడు నరేష్. ‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా చేసిన గోల్మాల్ వల్లే ఇంత సీన్ క్రియేట్ అయిందంటున్నాడు.
మా అసోషియేషన్ వివాదం ముదిరింది. మా నిధులన్నింటిని శివాజీ రాజా, శ్రీకాంత్ అండ్ టీమ్ మొత్తం తినేసిందని మా కొందరు సభ్యులు ఆరోపణలు చేశారు. రెండు రోజుల పాటు సాగిన వివాదంత ఇపుడు మరింత ముదిరింది.
మా అధ్యక్షుడు శివాజీరాజా ప్రెస్మీట్ పెట్టి మరీ తనపై ఆరోపణలు చేసిన వారికి ఛాలెంజ్ విసిరాడు. నిధులు దుర్వినియోగమైనట్లు నిరూపిస్త నా ఆస్తంతా రాసిచ్చేస్తానని చెప్పాడు. అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కావాలనే కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు శివాజీరాజా.