ఒకపుడు మేడం టుస్సాడ్స్లో ఒక సెలబ్రిటీ మైనపు విగ్రహం పెడుతున్నారంటే అదొక గౌరవం. ఆ స్టార్ పాపులారిటీకి నిదర్శనం. కానీ రీసెంట్గా సీన్ మారింది. మేడం టుస్సాడ్స్ మ్యూజియం కూడా కమర్షియల్ బాట పట్టింది. ప్రతి దేశంలో ఒక మ్యూజియం పెట్టేస్తోంది. లండన్, న్యూయార్క్ నుంచి తాజాగా బ్యాంకాక్, ఢిల్లీకి కూడా వచ్చింది. ఇన్ని మ్యూజియంలను నడపాలంటే కొత్త కొత్త సెలబ్రిటీలు కావాలి, వారి మైనపు విగ్రహాలు కావాలి కదా. అందుకే ప్రతి నెలకో బాలీవుడ్ సెలబ్రిటీని పిలిచి ఒక మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది మేడం టుస్సాడ్స్.