నాగశౌర్య సినిమాని ఆ నిర్మాత మధ్యలోనే వదిలేశాడు. ఎన్నికల ఖర్చుకి డబ్బులు కావాల్సి ఉంటుందని ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాని పక్కన పెట్టాడు నిర్మాత ఆనంద ప్రసాద్. అప్పటికే నర్తనశాల అట్టర్ఫ్లాప్లో ఉన్న నాగశౌర్యకి అది షాక్లా తగిలింది. నర్తనశాల ఫ్లాప్ కావడం వల్లే ఆనంద ప్రసాద్ భయపడిపోయి సినిమాని మిడిల్డ్రాప్ చేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే నాగశౌర్యకి ఎక్కడో లక్ ఉంది. ఈ సినిమా మళ్లీ మొదలు కానుందట.
తెలంగాణ ఎన్నికలు ముగిసినా, ఫలితాలు మంగళవారం నాడు వస్తాయి. పోలింగ్కి, ఫలితాలకి చాలా గ్యాప్ ఉండడంతో అభ్యర్థుల్లో టెన్సన్ రోజురోజుకి పెరుగుతోంది. తమ భవిత అంతా ఈవీఎంలలో నిక్షిప్తం అయింది, అందులో ఉన్న గుట్టు ఏంటో తెలియక టెన్సన్. దానికి తోడు బెట్టింగ్ మాఫియా పుకార్లు మరింతగా అయోమయంలో పడేశాయి.
ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో కొంతమంది సినిమా వాళ్లు నిలవనున్నారు. టీఆర్ ఎస్ని వీడి బాబూమోహన్ బీజేపీలో చేరాడు. ఈ తాజా మాజీ ఎమ్మెల్యే తదుపరి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చూడాలి. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్లు ఉవ్విళూరుతున్నారు. అందులో సీటు దాదాపుగా కన్ఫమ్ అయిన వ్యక్తి... నిర్మాత వి.ఆనంద ప్రసాద్. ఆయన శేరిలింగంపల్లి (హైదరాబాద్) నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని తెలుస్తోంది.