అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఉండాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు. ఇన్నాళ్లకి అది కుదిరింది. ఇప్పటి వరకు తన తండ్రి గీతాఆర్ట్స్ ఆఫీస్లో మొదటి ఫ్లోర్లో ప్రత్యేకంగా గదిని తీసుకొని తన ఆఫీస్గా వాడుకుంటూ వస్తున్నాడు. ఐతే ఇపుడు గీతా ఆర్ట్స్ వరుసగా సినిమాలు నిర్మిస్తుండడంతో ఆ ఆఫీస్ సరిపోవడం లేదు. సో..తనని కలవాలని వచ్చే నిర్మాతలు, దర్శకులు, అలాగే తన టీమ్ ఉండేందుకు ప్రత్యేకంగా ఆఫీస్ తీసుకున్నాడు.
ఇటీవలే జూబ్లీహిల్స్లోని త కొత్త ఆఫీస్లోకి మూవ్ అయ్యారట.
"గీత గోవిందం" దర్శకుడు పరశురామ్ గీత మారింది. ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీసినా...ఆయన పేరు సామాన్య ప్రేక్షకులకి అంతగా పరిచయం లేదు. గీత గోవిందంతో ఒక్కసారిగా అందరి చూపు ఆయనపై పడింది. 55 కోట్ల రూపాయల బ్లాక్బస్టర్ ఈ మూవీ. ఇంత పెద్ద హిట్ రావడంతో నిర్మాతలంతా ఆయన వెంట పడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఒక మూవీ చేయమని అడిగాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఐతే అది ఇపుడే ఉండదని అంటున్నాడు ఈ నర్సీపట్నం బాబు.