ప్రస్తుతం 'దంగల్' సినిమా చైనాలో బీభత్సంగా ఆడుతోంది. త్వరలోనే 'బాహుబలి 2' సినిమా కూడా చైనాలో విడుదలకాబోతోంది. అయితే చైనా వసూళ్లు చెప్పుకోడానికి తప్ప దేనికీ పనికిరావంటున్నాడు రాజమౌళి. కేవలం గ్రాస్ పెంచుకోడానికే తప్ప, జేబు నిండదని అంటున్నాడు. చైనా లెక్కల్లో లూప్ హోల్స్ ను బయపెట్టాడు.
ఇప్పటికే దంగల్ సినిమా చైనాలో బీభత్సంగా ఆడేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 900 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా హవా ఇంకాస్త పెరగనుంది. ఎందుకంటే చైనాలో అతిపెద్ద ఫెస్టివల్ ప్రారంభమైంది. పట్టణాల్ని, పల్లెల్ని కలుపుతూ 3 రోజుల పాటు సాగే ఆ పండగ పేరు డ్రాగన్ బోట్ ఫెస్టివల్. ఈ పండగ వచ్చిందంటే చాలు చైనాలో ఆఫీసులు, స్కూల్స్ అన్నీ సెలవులే. ట్రయిన్స్, బస్సులు, టాక్సీలు అన్నీ కిటకిటలాడిపోతాయి.