జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఒంటరి పోరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన తెలుగుదేశంతో పార్టీ పెట్టుకుంటారని ప్రచారం జరుగుతున్నా.. దానికి పూర్తి భిన్నంగా వ్యవహారం ఉంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చంద్రబాబునాయుడుని, లోకేష్ని, బాలయ్యని, సీబీఎన్ ఛానెల్ అనిపించుకుంటున్న ఏబీఎన్ని.. టార్గెట్ చేస్తూ నిత్యం యూట్యూబ్లో వాయిస్తున్నాడు. అన్నయ్య ఇంతగా టీడీపీని ట్రోల్ చేస్తున్నపుడు తమ్ముడు అదే పార్టీతో చేతులు కలుపుతాడని ప్రచారం చేయడం అసంబంద్దంగా లేదూ!
మన పూరి జగన్నాధ్.. బాలయ్యను వదలట్లేదు. ఇప్పటికే బాలయ్యను తేడా సింగ్ గా చూపించిన పూరి, ఇప్పుడు మరో సినిమా కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. దీని కోసం అతడు చేస్తున్న ప్రయత్నాలు క్లియర్ గా తెలిసిపోతున్నాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కాగానే బాలయ్యకు మొట్టమొదట వెళ్లిన కాల్ ఎవరిదో తెలుసా? ఆ కాల్ చేసిన వ్యక్తి పూరి జగన్నాధ్. సినిమా చూశానని, సాక్ష్యాత్తూ పెద్ద ఎన్టీఆర్ ను చూసినట్టు ఉందంటూ పూరి, బాలయ్యను పొగిడేశాడు.
అపుడెపుడో బాలయ్య చేసిన కామెంట్స్కి నాగబాబు రీసెంట్గా సమాధానాలు ఇచ్చాడు. యూట్యూబ్లో రోజుకో కామెంట్తో బాలయ్యని టార్గెట్ చేశాడు. ఆరు ప్రశ్నలు లేవదీసి...వాటికి తనదైన రీతిలో బాలయ్యకి కౌంటర్లు ఇచ్చాడు. తాజాగా దీనికి ముగింపు పలికాడు. చివరి వీడియోలో మరింత ఘాటుగా మాట్లాడాడు. అంతేకాదు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు.
బోయపాటి తీసిన "వినయ విధేయ రామ" సినిమా విడుదలైంది. విమర్శకులందరూ కూడబలుక్కొని రాసినట్లు....ఒకేతీరుగా సినిమాని చీల్చి చెండారు. ఆ రేంజ్లోనే బ్యాడ్గా ఉందిలెండి. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఒక రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. బోయపాటి మేకింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేటింగ్స్, విమర్శలు ఎలా ఉన్నా..తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లను అందుకొంది. సంక్రాంతి సెలవులు కూడా ఊపందుకోవడంతో... మరో నాలుగు అయిదు రోజుల వరకు ఈ సినిమా కలెక్షన్లకి పెద్దగా సమస్య ఏమీ ఉండదు. రెవిన్యూ సంగతెలా ఉన్నా.. బ్యాడ్నేమ్ మాత్రం బాగా వచ్చింది.
తనపై వరుసగా వీడియో కామెంట్లతో కలకలం రేపుతోన్న నాగబాబుపై స్పందించేందుకు బాలయ్య నిరాకరించారు. నాగబాబు కామెంట్స్పై మీ స్పందన ఏంటని తిరుపతిలో మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
విద్యాబాలన్, సుమంత్, సాయి కొర్రపాటిలతో కలిసి బాలయ్య ఈ రోజు తిరుమల తిరుపతి వచ్చారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు ‘యన్టిఆర్ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదలవుతున్న కారణంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు.