ఒక సినిమాలో దేవినేని నెహ్రు. మరో సినిమాలో వైఎస్సార్. ఇపుడు చంద్రబాబు నాయుడు. ఒకే నటుడు..ఇలా ముగ్గురు రాజకీయ నేతల పాత్రల్లో. శ్రీతేజ్ అనే యువ నటుడు ఇపుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబునాయుడు పాత్ర పోషించనున్నాడు. ఈ ఫోటోలను వర్మ విడుదల చేశాడు.
ఈ నటుడు ఇంతకుముందు వర్మ తీసిన వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించాడు. అలాగే తాజాగా క్రిష్ తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో డాక్టర్ వైఎస్సార్గా కనిపించాడు. మూడు పాత్రల్లోనూ ఆయా వ్యక్తుల పోలీకలను రాబట్టడం నిజంగానే విశేషమే.
మహా నటుడు ఎన్టీఆర్ జీవితం వెండి తెరపై ఆవిష్కృతం అవుతుందనగానే... తెలుగు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా, అభిమానంగా వేచిచూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే రాముడైనా... కృష్ణుడైనా... శివుడైనా... వేంకటేశ్వర స్వామి అయినా ఆ పాత్రకు ఎన్టీ రామారావు మాత్రమే జీవంపోయగలరు. ఆ దేవతామూర్తులు ఎన్టీఆర్ లాగే ఉంటారేమో అనిపిస్తుంది.
ఎన్టీఆర్ బయోపిక్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించారు. ఐతే ఇంత భారీ సినిమాని అంత స్పీడ్గా పూర్తి చేయగలరా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని క్రిష్ వద్ద ప్రస్తావించాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9న విడుదల చేయాలని చంద్రబాబు క్రిష్కి, బాలయ్యకి స్పష్టం చేశాడట.