ఈ డైలాగ్ అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోనిది. ఇదే డైలాగ్ని కొంత మార్చి బన్నికి చెపుతున్నారు ట్రాలర్స్. "మనకి రేటింగ్ బాగా వచ్చినపుడు రివ్యూలు మాట్లాడి.. తేడా కొట్టినపుడు రెవిన్యూలు చెప్పొద్దు సార్.. "అంటూ బన్నిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రాలింగ్ చేస్తున్నారు
అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కలెక్షన్లు అదుర్స్ అన్న రీతిలో సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా తెలుగునాట దుమ్మురేపింది డీజే. అయితే తాజాగా ఈ సినిమాకి పైరసీ బెడద మొదలైంది.