అల్లు అర్జున్కి మార్కెట్ పెరుగుతోంది. మొదట కేరళ మార్కెట్ని కైవసం చేసుకున్నాడు. ఇపుడు నార్త్ని దోచుకుంటున్నాడు. నార్త్లో ఆయన సినిమాలు డబ్ అయి హల్చల్ చేస్తున్నాయి. అంటే థియేటర్లలో కాదు. సెల్ఫోన్లలో, కంప్యూటర్ తెరలపై.
బన్ని నటించిన "సరైనోడు", "దువ్వాడ జగన్నాథం" హిందీ వెర్సన్ సినిమాలు.. యూట్యూబ్లో 100 మిలియన్లకి పైగా వ్యూస్ని అందుకున్నాయి. కేవలం రెండే రెండు నెలల్లో దువ్వాడ జగన్నాథం 10 కోట్ల వ్యూస్ (100 మిలియన్లు) దాటింది. ఇందులో నాలుగున్నర లక్షల దాకా లైక్స్ కూడా ఉన్నాయి.
'డీజే'లో చూపించిన అందాలు పూజా హెగ్డేకు టాలీవుడ్ లో కొత్త ఇమేజ్ తీసుకొచ్చాయి. ఎందుకంటే గత రెండు సినిమాల్లో ఆమె గ్లామర్ షో చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎట్టకేలకు డీజేతో ఆ అవకాశం రావడంతో దాన్ని ఫుల్లుగా వాడేసుకుంది పూజా. పనిలోపనిగా బికినీ కూడా వేసింది. ఈ గ్లామర్ షో వల్ల ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కలెక్షన్లు అదుర్స్ అన్న రీతిలో సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా తెలుగునాట దుమ్మురేపింది డీజే. అయితే తాజాగా ఈ సినిమాకి పైరసీ బెడద మొదలైంది.