Trivikram directed ‘Aravindha Sametha’ is all set to release on October 11. NTR lost his father in an accident recently and is going through turbulent phase. Yet, he has completed the movie without taking a break. As the film is releasing, NTR speaks about it and his life and career in general.
జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్రామ్ తమ తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. కల్యాణ్రామ్ కూడా తన తండ్రి మరణాన్ని తలుచుకొని స్టేజ్పైనే ఏడ్చేశాడు. నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన నెల రోజుల తర్వాతే ఈ ఈవెంట్ జరిగింది.
నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు శాపంలా వెంటాడుతున్నాయి. హరికృష్ణ కుటుంబంలో ఇప్పటి వరకు మూడు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఇందులో హరికృష్ణ, ఆయన కుమారుడు జానకీరామ్ చనిపోయారు. మరో రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డాడు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడిగా హరికృష్ణ తెలుగు దేశం పార్టీ నేతలకి అత్యంత ప్రియమైన వ్యక్తి. పాత తరం రాజకీయ నాయకులు.. ఆయన్ని చైతన్య రథసారథిగా అభిమానిస్తారు. సినిమా పరిశ్రమ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైతన్య రథం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బస్సు స్టీరింగ్ని చేపట్టింది ఎవరో కాదు ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణనే.