ఐటీ రైడ్స్ ను మరో కోణంలో చూడడం అనేది ఈ దేశంలో చాన్నాళ్ల కిందటే మొదలైంది. నిజంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుమానం వచ్చి, ముందే కోవర్ట్ ఆపరేషన్ చేసి, ఆ తర్వాత మూకుమ్మడిగా నివాసాలు-ఆఫీసులపై దాడులు చేయడం అనేది ఇప్పుడు దాదాపు లేదనే చెప్పాలి. ఐటీ దాడులనేది ఇప్పుడు రాజకీయమైపోయింది. కక్షపూరితంగా ఒకరిపై ఒకరు దాడులు చేయించుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి రష్మిక ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరమైన అంశంగా మారింది.
హైదరాబాద్లోని ఐటీ ప్రాంతంగా పేరొందిన గచ్చిబౌలిలో మహేష్బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభానికి రెడీ అయింది. నిజానికి ఈ మల్టీప్లెక్స్ని అమీర్ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంతోనే ప్రారంభించాలనుకున్నాడు. అమీర్ఖాన్ని ఇన్వైట్ చేశారు. కానీ అమీర్ఖాన్ రాలేనని చెప్పడంతో క్యాన్సిల్ అయింది. ఇక ఇపుడు సూపర్స్టార్ రజనీకాంత్ భారీ చిత్రం 2.0తో ప్రారంభిస్తాడట. రజనీకాంత్ని ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.