కళాతపస్వి కె.విశ్వనాథ్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ కలవడం ఒక సర్ప్రైజ్. ఇది మర్యాదపూర్వక కలయిక మాత్రమే. కె.విశ్వనాథ్ సినిమాలకి సీఎం కేసీఆర్ అభిమాని. ఒక అభిమానిగా తనను కలవడానికి వచ్చాను అని కేసీఆర్ చెప్పారని విశ్వనాధ్ మీడియాకి వివరించారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని విశ్వనాధ్ ఇంటికి ఆదివారం కేసీఆర్ వెళ్లారు.
తనకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇప్పుడు ఎలా ఉందని వాకబు చేసేందుకే సీఎం వెళ్లారన్న వార్తలను విశ్వనాధ్ తోసిపుచ్చారు. తాను పెర్ఫెక్టు హెల్తీ అన్నారు విశ్వనాధ్.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి స్టూడియో కట్టేందుకు స్థలం పొందిన మొదటి ఫిల్మ్మేకర్...ఎన్.శంకర్. ఇప్పటి వరకు హైదరాబాద్లో స్టూడియోల కోసం స్థలం తీసుకున్నవారంతా ఆంధ్రప్రాంతానికి చెందిన నిర్మాతలే. అలాగే వారికి 70, 80, 90లలో స్థలాలు ఇచ్చారు. అపుడు ఇప్పటి రేంజ్లో ధరలు లేవు. ఇపుడు దర్శకుడు ఎన్.శంకర్కి ఐదు ఎకరాల స్థలం అంద చేసింది తెలంగాణ ప్రభుత్వం.