ఈ శుక్రవారం రిలీజైన "బ్రాండ్బాబు"పై కేసు నమోదైంది. ఒక మహిళా జర్నలిస్ట్ సినిమాపై కేసు వేసింది. తన అనుమతి లేకుండా తన ఫోటోని సినిమాలో ఉపయోగించారని ఓ మహిళా జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో చావుకి సంబంధించిన సన్నివేశంలో తన ఫోటోని చూపించారని, దీనికి తన పర్మిషన్ తీసుకోలేదని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇది తనకి, తన కుటుంబ సభ్యులకి తీవ్ర మనస్థాపం కలిగించిందని ఆమె చెప్పడంతోమూవీ మేకర్స్పై ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్బాబు. మారుతి కథ అందించిన మూవీ ఇది. ఆయనే సమర్పుకుడు కూడా. ప్రభాకర్.పి. దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకొంది. సెన్సార్ కంప్లీట్ అయ్యి యూ సర్టిఫికేట్ పొందింది. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్అవుతుందని మేకర్స్ ప్రకటించారు.