జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఒంటరి పోరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన తెలుగుదేశంతో పార్టీ పెట్టుకుంటారని ప్రచారం జరుగుతున్నా.. దానికి పూర్తి భిన్నంగా వ్యవహారం ఉంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చంద్రబాబునాయుడుని, లోకేష్ని, బాలయ్యని, సీబీఎన్ ఛానెల్ అనిపించుకుంటున్న ఏబీఎన్ని.. టార్గెట్ చేస్తూ నిత్యం యూట్యూబ్లో వాయిస్తున్నాడు. అన్నయ్య ఇంతగా టీడీపీని ట్రోల్ చేస్తున్నపుడు తమ్ముడు అదే పార్టీతో చేతులు కలుపుతాడని ప్రచారం చేయడం అసంబంద్దంగా లేదూ!
అపుడెపుడో బాలయ్య చేసిన కామెంట్స్కి నాగబాబు రీసెంట్గా సమాధానాలు ఇచ్చాడు. యూట్యూబ్లో రోజుకో కామెంట్తో బాలయ్యని టార్గెట్ చేశాడు. ఆరు ప్రశ్నలు లేవదీసి...వాటికి తనదైన రీతిలో బాలయ్యకి కౌంటర్లు ఇచ్చాడు. తాజాగా దీనికి ముగింపు పలికాడు. చివరి వీడియోలో మరింత ఘాటుగా మాట్లాడాడు. అంతేకాదు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు.
తనపై వరుసగా వీడియో కామెంట్లతో కలకలం రేపుతోన్న నాగబాబుపై స్పందించేందుకు బాలయ్య నిరాకరించారు. నాగబాబు కామెంట్స్పై మీ స్పందన ఏంటని తిరుపతిలో మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
విద్యాబాలన్, సుమంత్, సాయి కొర్రపాటిలతో కలిసి బాలయ్య ఈ రోజు తిరుమల తిరుపతి వచ్చారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు ‘యన్టిఆర్ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదలవుతున్న కారణంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు.
ఒకపుడు నాగబాబుని యమా ట్రోలింగ్ చేశారు ఆర్జీవీ. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ నీడలో బతికే వ్యక్తి అన్నట్లుగా మాట్లాడాడు వర్మ. సొంతంగా ఇమేజ్ లేని నాగబాబు నా గురించి కామెంట్ చేయడం ఏంటని వర్మ ఓ రేంజ్లో నాగబాబుని సోషల్ మీడియాలో ఆడుకున్నాడు.
క్యాలెండర్లు మారాయి. ఈక్వేషన్స్ ఛేంజ్ అయ్యాయి. ఇపుడు నాగబాబు బాలయ్యని టార్గెట్ చేస్తూ వీడియో కౌంటర్లు ఇస్తున్నాడు. దాంతో సీన్లోకి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. నాగబాబు గట్స్ని చూసి అసూయపడుతున్నానని అంటున్నాడు వర్మ