బాలయ్య కవితా పరంపర గురించి చాలామందికి తెలిసిందే. అరవింద సమేత ఫంక్షన్ లో పూజా హెగ్డేను పొగుడుతూ బాలయ్య ఓ కవిత అందుకుంటే ఆడిటోరియం చప్పట్లో మారుమోగిపోయింది. ఇప్పుడు బాలయ్యకు పోటీగా నాగబాబు కూడా కవితలతో రెడీ అయ్యారు. తమకు కూడా కవితలు వచ్చంటూ ఒకటి వదిలారు. అయితే ఇది బాలయ్యను పొగిడే కవిత కాదు, ఎన్టీఆర్ బయోపిక్ పై సెటైర్లు వేస్తూ రాసిన కవిత.
కట్టుకథలు కొన్ని
కల్పనలు ఇంకొన్ని
చుట్టనేల.. మూట కట్టనేల
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా
విశ్వదాభి రామ
వినరా మామ
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఏబీసీడీ". సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
జూనియర్ ఎన్టీఆర్కిపుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో అన్ని వర్గాలకి చేరువయి అయ్యాడు. సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ పొందాడు. ఆఖరికి మహేష్బాబులాంటి అగ్రహీరో కూడా జూనియర్ని తన సినిమా ఈవెంట్కి గెస్ట్గా పిలవాల్సి వచ్చింది. ఆ రేంజ్లో జూనియర్ ఇపుడు పాపులర్ అయ్యాడు. ఇక చరణ్తో ఎన్టీఆర్కున్న దోస్తీ కారణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్కి ఫిదా అయిపోయారు. అందుకే జూనియర్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
నీహారిక కొణిదెల ఆ మధ్య ఒక హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇపుడు ఆమె ఆలోచన డ్రాప్ చేసుకున్నట్లు సమాచారం. ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది (ట). అందుకే ఆమె ఎడాపెడా కొత్తగా సినిమాలు ఒప్పుకుంటోంది. త్వరలోనే హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా రిలీజ్ అవుతోంది.
రీసెంట్గా శ్రియాతో కలిసి ఒక సినిమా లాంచ్ చేసింది. అందులో ఆమె రెండో హీరోయిన్. అలాగే ముద్దపప్పు వెబ్ సిరీస్ దర్శకుడు తీస్తున్న తొలి చిత్రంలోనూ ఆమే కథానాయిక. అంటే చేతిలో హీరోయిన్గా రెండు సినిమాలు సెట్స్పై ఉన్నాయి.