పెళ్లి అయి దాదాపు నెల రోజులవుతోంది. కొత్త జంట చైతన్య, సమంత ఇపుడు హనీమూన్ టూర్లో ఉన్నారు. స్కాట్లాండ్కి వెళ్లింది ఈ జంట. పెళ్లయిన నెలన్నర రోజుల తర్వాత వీరికి రిసెప్సన్ ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నాడు అక్కినేని నాగార్జున.
సమంత అక్కినేని వారి కోడలుగా ఒదిగిపోయింది. పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చిన ఈ కొత్త పెళ్లి కూతురు తనకి విషెష్ చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ని కాపాడాలన్న విషయం తనకి తెలుసు అని అంటోంది ఈ బ్యూటీ.