రీసెంట్ గా కల్యాణ్ రామ్ సరసన "118" సినిమా చేసింది షాలినీ పాండే. ఆ మూవీ థియేటర్లలోకి కూడా వచ్చింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది షాలినీ. ఈ మేరకు అగ్రిమెంట్ పూర్తయింది. రేపోమాపో అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.
నాగశౌర్య సినిమాని ఆ నిర్మాత మధ్యలోనే వదిలేశాడు. ఎన్నికల ఖర్చుకి డబ్బులు కావాల్సి ఉంటుందని ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాని పక్కన పెట్టాడు నిర్మాత ఆనంద ప్రసాద్. అప్పటికే నర్తనశాల అట్టర్ఫ్లాప్లో ఉన్న నాగశౌర్యకి అది షాక్లా తగిలింది. నర్తనశాల ఫ్లాప్ కావడం వల్లే ఆనంద ప్రసాద్ భయపడిపోయి సినిమాని మిడిల్డ్రాప్ చేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే నాగశౌర్యకి ఎక్కడో లక్ ఉంది. ఈ సినిమా మళ్లీ మొదలు కానుందట.
ఒక్క హిట్తో నాగశౌర్యలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా కాలంగా నటిస్తున్నా..హీరోగా పాపులారిటీ పెరగడం లేదని గ్రహించిన నాగశౌర్య "ఛలో" సినిమాని సొంతంగా నిర్మించుకున్నాడు. ఆ సినిమా కామెడీ కారణంగా మంచి విజయం సాధించింది. "ఛలో" ఇచ్చిన బూస్టప్తో "నర్తనశాల" అనే మరో సినిమాని నిర్మించాడు. ఇది కూడా ఎంటర్టెయిన్మెంట్తో కూడిన మూవీనే. ఐతే ఈ సినిమాపై ధీమా కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి.